‘మీరు అంత బిజీనా.. నాకే పనిలేదా..?’ : చంద్రబాబు

12 Jun, 2018 16:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మంగళవారం సమావేశమైంది. మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే చంద్రబాబుతో జిల్లా పార్టీ అధ్యక్షుడు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ధర్మపోరాట సభలు, టీడీపీ బలోపేతంపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో నేతల గైర్హాజరు కావడంతో ఆయన మండిపడ్డారు.

ఎమ్మెల్యేలు ఎందుకు హజరు కాలేదని  జిల్లా అధ్యక్షులను ప్రశ్నించారు. ‘మీ నేతలు అంత బిజీగా ఉన్నారా ? నాకు పనిలేక ఈ సమావేశానికి వచ్చానా.. సెక్రటేరియట్‌లో నాకు చాలా పనులు ఉన్నాయి.. రెండు గంటలు కూడా సమావేశానికి రాని వాళ్ళకు పదవులు అవసరమా ? హోదా పార్టీ వల్లే వస్తుంది.. అలాంటి పార్టీ అంటే లెక్కలేకపోతే ఎలా?’ అని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షులుగా గట్టిగా వ్యవహరించాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు