బాబు ఇంటి ముందు టీడీపీ నేత ఆందోళన

20 Jul, 2020 11:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా వెంకటేశ్వరరావు అనే టీడీపీ నాయకుడు సోమవారం చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు తనను రాజకీయంగా 30 ఏళ్లగా వాడుకొని వదిలేశారని ఆరోపించారు.  జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌గా వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. తన సమస్యలను చెప్పుకోవడానికి కూడా చంద్రబాబు సమయం ఇవ్వడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంకటేశ్వరరావు బాబు ఇంటిముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

మరిన్ని వార్తలు