సాక్షి, హైదరాబాద్ : ‘కోడెల మెడపై గాట్టు ఉన్నాయి కాబట్టి.. ఉరేసుకున్నారని డాక్టర్ల అభిప్రాయం. అక్కడ ఇంట్లో చూసిన విషయాలను బట్టి ఆ విధంగా తెలుస్తోంది’ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏది ఏమైనప్పటికి ఆయన ఇక లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బసవతారకం ఆసుపత్రి వైద్యులు ఎంత శ్రమించినప్పటికి ఆయనను కాపాడలేకపోయారని, ఆసుపత్రిలో చేర్చిన కొద్దిసేపటికే ఆయన మరణించారని చెప్పారు. శవపరీక్షల నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారని, మరిన్ని విషయాలు రిపోర్టు వచ్చిన తర్వాత తెలుస్తాయని అన్నారు.
చదవండి:
కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు!
కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి
కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి
కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?
కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?