జగన్‌ సమక్షంలో చేరిక

4 Mar, 2019 07:27 IST|Sakshi
జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరిన టీడీపీ నాయకుడు గబ్బర్‌సింగ్‌

తూర్పుగోదావరి, కాట్రేనికోన (ముమ్మిడివరం): పల్లంకుర్రుకు చెందిన యువ పారిశ్రామికవేత్త, టీడీపీ నాయకుడు భూపతిరాజు శివకుమార్‌వర్మ (గబ్బర్‌సింగ్‌) హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రఘురామకృష్ణంరాజుతోపాటు గబ్బర్‌సింగ్‌ పార్టీలో చేరారు. ఆయన చేరికపై ముమ్మిడివరం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, నాయకులు భూపతిరాజు సుబ్రమణ్యంరాజు (బుల్లిరాజు), నడింపల్లి సూరిబాబు, పెన్మెత్స రామకృష్ణంరాజు (గెడ్డం కృష్ణ), నేల కిషోర్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు