‘ఆధార్‌’లో వయస్సు మార్చి.. అడ్డంగా దోచేస్తున్నారు!

9 Feb, 2019 10:28 IST|Sakshi

వయస్సు పెంచి వృద్ధాప్య పెన్షన్లు కాజేస్తున్న పచ్చ పార్టీ నేతలు

సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ నేతల అక్రమాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. తమ పార్టీ అధికారంలో ఉండటంతో ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని పచ్చనేతలు దోచేస్తున్నారు. ఆఖరికీ వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ను కూడా వదిలిపెట్టడం లేదు. ఏకంగా ఆధార్‌ కార్డుల్లో వయస్సు పెంచేసి వారి పేరిట వచ్చే పెన్షన్‌ను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ వ్యవహారం తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం ‘మీ సేవ’లో వెలుగుచూసింది. ఇక్కడి మీ సేవను అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు ఆధార్‌ కార్డుల్లో వయస్సును మారుస్తున్నారు. తక్కువ వయస్సు ఉన్నా కూడా ఆధార్‌ కార్డుల్లో వయస్సు పెంచి.. వృద్ధుల పేరిట వచ్చే పెన్షన్‌తో తమ జేబులు నింపుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు