వైన్‌ షాప్‌ల వద్ద తెలుగు తమ్ముళ్ల హల్‌చల్‌

31 Mar, 2019 11:00 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఒక వైపు చంద్రబాబు నాయుడు మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ ఊదరగొడుతుంటే.. మరో వైపు తెలుగు తమ్ముళ్లు మద్యం మత్తులో ఊగిపోతున్నారు. ఎన్నికల ప్రచారం వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ వైన్‌ షాప్‌ దగ్గర చూసినా తెలుగు తమ్ముళ్లే దర్శనం ఇస్తున్నారు. ప్రచారానికి జనాలను తరలిస్తూ మద్యం మత్తులో ముంచుతున్నారు. పనిలోపనిగా వారు సైతం మద్యం సేవించి పండుగ చేసుకుంటున్నారు. విశాఖ జిల్లాలోని మద్యం దుకాణాల వద్ద  తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైన నుంచి తీవ్రస్థాయిలో మద్యం పంపిణీ చేస్తున్నారు. టోకేన్లు ఇచ్చి మరీ మద్యం అందిస్తున్నారు. విశాఖ ఈస్ట్‌లో మద్యం ఏరులైపారుతుంది. ప్రచారానికి వచ్చిన ప్రజలకు మద్యం బాటిళ్లను అందించి మత్తులో ముంచుతున్నారు. విచ్చల విడిగా మద్యం సేవించి స్థానిక మహిళలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. గాజువాక పరిసర ప్రాంతంలో ఒక మహిళపై కొంతమంది అనుచితంగా వ్యవహరించి ఆమె మెడలో గొలుసు ఎత్తుకెళ్లారు. 

మరో వైపు శ్రీకాకుళం జిల్లా రాజాంలో కూడా తెలుగు తమ్ముళ్లు హల్‌చల్‌ చేశారు. నిన్న (శనివారం) సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా రాజాం ప్రజలను మద్యం మత్తులో ముంచారు. ప్రచారానికి వచ్చన వారికి టోకేన్లు ఇచ్చి నేరుగా వైన్‌షాప్‌కు తరలించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు ఇలా మద్యాన్ని ఎరగా వేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా మందును వార్డులకు, డివిజన్లకు చేరుస్తున్నారు. పలువురు టీడీపీ అభ్యర్థులు భారీగా మద్యం నిల్వలను ఉంచారు. నిఘా పెట్టాల్సిన అబ్కారీ శాఖ మాత్రం మౌన వ్రతం పాటిస్తుండటంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది.

>
మరిన్ని వార్తలు