టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి ...

10 Nov, 2018 11:40 IST|Sakshi
అమరనాథరెడ్డి తదితరులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న చెవిరెడ్డి

చిత్తూరు, తిరుపతి రూరల్‌ : చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ పాకాల మండల అధ్యక్షుడు వలివేడు విక్రంరెడ్డి, రాజారెడ్డి ఆధ్వర్యంలో మొగరాలకు చెందిన పాకాల మండల టీడీపీ యూత్‌ మాజీ అధ్యక్షుడు అమరనాథరెడ్డి శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. తుమ్మలగుంటలో అమరనాథరెడ్డి, ఆయన అనుచరులకు రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆ«హ్వానించారు.  అమరనాథరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు, ప్రజలకు అండగా తానున్నానంటూ ఆదుకునే నిజమైన నాయకుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అని కొనియాడారు. విక్రంరెడ్డి, రాజారెడ్డి నాయకత్వంలో మండలంలో వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. మండల ఉపాధ్యక్షుడు బాలశంకరచౌదరి, నర్సారెడ్డి, నేలదానిపల్లె మధు, భాస్కర్‌నాయుడు, ప్రత్యూషరెడ్డి, కేశవులు, హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు