కోడ్‌ వీరికి వర్తించదా..?

13 Mar, 2019 09:42 IST|Sakshi
కొఠారీ గ్రామంలోని ఎన్టీఆర్‌ సుజలధార పథకంపై బొమ్మలు

సాక్షి,ఇచ్ఛాపురం రూరల్‌: ఎమ్మెల్సీ, సార్వత్రిక ఎన్నికలు సందర్భంగా ప్రస్తుతం కోడ్‌ అమల్లో ఉంది. అయితే టీడీపీ నాయకులు ఉన్న గ్రామాల్లో మాత్రం కోడ్‌ వర్తించని విధంగా ఉంది. ఇచ్ఛాపురం మండలం కొఠారీ, తులసిగాం గ్రామాల్లో ఉన్న ఎన్టీఆర్‌ సుజలధార ట్యాంక్‌పై బొమ్మలను అధికారులు తొలగించలేదు. అదే విధంగా ఇన్నేశుపేట జంక్షన్‌లో ఉన్న విశ్రాంతి భవనంపై ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లతో ఉన్న బోర్డు, పాఠశాలల గోడలపై ఉన్న టీడీపీ ప్రచార బోర్డులను తొలగించేందుకు అధికారులు సైతం జంకుతున్నారు. 

మరిన్ని వార్తలు