రాజ్‌ఘాట్‌ వద్ద టీడీపీ ఎంపీల మౌన దీక్ష

10 Apr, 2018 01:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీలు సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద మౌన దీక్ష చేపట్టారు. ఎంపీలు సుజనా చౌదరి, మాగంటి బాబు, జయదేవ్‌ తదితరులు మౌనదీక్ష చేపట్టారు. హామీల సాధనకు కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని, బీజేపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు.

మరిన్ని వార్తలు