బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌

22 Jun, 2020 11:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోఠిలోని కరోన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముట్టడించేందుకు యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆయన వెంటఉన్న బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ టెస్టుల సంఖ్య పెంచాలని ఈ సందర్భంగా బండి సంజయ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని అన్నారు.
(చదవండి: బీజేపీ వల్లే దేశంలోకి కరోనా)

ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని పిలుపు ఇచ్చాం. నిన్న టీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. పక్క రాష్ట్రాల్లో ఎన్ని టెస్టులు చేశారు. ఇక్కడ ఎన్ని చేశారో చెప్పాలి. మన సీఎం పారసీటమాల్ ముఖ్యమంత్రి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు. డాక్టర్లు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరాం. పీపీఈ కిట్లు, మాస్కులు కూడా లేవని డాక్టర్లు ధర్నాలు చేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు జోకర్ల లాగా మారారు. హెల్త్ బులెటిన్ కూడా ఇష్టం వచ్చినట్లు విడుదల చేస్తున్నారు’అని సంజయ్‌ పేర్కొన్నారు.
(చదవండి: ఉస్మానియాలో నిర్వాకం.. బతికుండగానే)

మరిన్ని వార్తలు