మధిరలో 91.27% పోలింగ్‌

8 Dec, 2018 04:12 IST|Sakshi

పాలేరు, నర్సంపేట, మునుగోడుల్లో 90% పైగా పోలింగ్‌

మలక్‌పేటలో అత్యల్పంగా 40%, ఎల్బీనగర్‌లో 42%

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో.. కడపటి వార్తలందేవరకు 67.7% పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఈ శాతంలో స్వల్ప మార్పులు ఉంటాయని పేర్కొంది. కాగా.. ఖమ్మం జిల్లా మధిరలో రాష్ట్రంలోనే అత్యధికంగా 91.27% మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. పాలేరు (90.97%), మునుగోడులో (90.88%), నర్సంపేటలో (90.10%) తదుపరి స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా మలక్‌పేట నియోజకవర్గంలో 40% పోలింగ్‌ నమోదు కాగా ఎల్బీనగర్‌లో 42%, యాకుత్‌పురలో 41.75% మంది మాత్రమే తమ హక్కును వినియోగించుకున్నారు. ఈసారి పోలింగ్‌ శుక్రవారం కావడంతో హైదరాబాద్‌లోని సెగ్మెంట్లలో ఓటింగ్‌ తక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ శాతం

మరిన్ని వార్తలు