ప్రధాన వేదికపై వెయ్యిమంది..

29 Apr, 2018 16:13 IST|Sakshi

మరికాసేపట్లో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభ ఆదివారం సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికపై వెయ్యిమంది కూర్చునేవిధంగా ఏర్పాటు చేశారు. తొలివరుసలో అన్ని తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థులు కూర్చోనున్నారు. తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసుకున్న అమరుల కుటుంబసభ్యులు, బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబసభ్యులు కూడా వేదికపై కూర్చోనున్నారు. ఈ సభలో పార్టీ అధినేత కోదండరాంతోపాటు హరగోపాల్‌, నాగేశ్వర్‌ ప్రసంగించనున్నారు.

>
మరిన్ని వార్తలు