సీమకు తీవ్ర అన్యాయం : టీజీ వెంకటేష్‌

13 Sep, 2019 18:28 IST|Sakshi

సాక్షి, అనంతపురం : రాజధాని విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత టీజీ వెంకటేష్‌ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. రాయలసీమను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకోవాలని కోరారు. సీమలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని సూచించారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ఏర్పాటు చేయాలని, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణ జరగాలని కోరారు.

మరిన్ని వార్తలు