తాజ్‌ ముందు ట్రూడో.. ఫొటోలో టవల్‌తో కేజ్రీవాల్‌!

19 Feb, 2018 09:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తాజాగా భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో ఆదివారం తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. ప్రేమకు ప్రతిరూపమైన తాజ్‌మహల్‌ ఎదుట ట్రూడూ భార్య, పిల్లలతో కలిసి ఫొటోలు దిగారు. అయితే, ఈ ఫొటోలో ఓ పొరపాటు కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ కంటబడింది. ఆయన ఆనందభరితలయ్యారు. వెంటనే ట్వీట్‌ చేశారు. తాజ్‌మహల్‌ ముందు ట్రూడో కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలో స్విమ్మింగ్‌ దుస్తులతో ఉన్న ఓ వ్యక్తి పడగలిగాడు. ఏకంగా ప్రధాని ఫొటోలో ఫొటోబాంబ్‌ అయ్యాడు’ అని శశి ట్వీట్‌ చేశారు.

నిజానికి శశి ట్వీట్‌ చేసిన ఆ ఫొటోలో ట్రూడో కుటుంబం వెనుక ఉన్నది ఎవరో కాదు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌. తాజ్‌ ముందు ట్రూడో ఫ్యామిలీ ఫొటోలో ఆయన టవల్‌లో ఉన్నట్టు ఎవరో ఫొటోషాప్‌ చేశారు. ఈ విషయాన్ని గుర్తించకుండా నిజమైన ఫొటోనేమోనని థరూర్‌ అనుకున్నారు. తర్వాత ఆయన సారీ చెప్పారు. అది ఫొటోషాప్‌ చేసిన చిత్రమని గుర్తించలేకపోయానని, సోషల్‌ మీడియాలో నిజంగా అనిపించే చిత్రాలను కూడా నమ్మలేమని ఆయన ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు