రేణమాల (ఉదయగిరి నియోజకవర్గం), శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు : అక్రమంగా ఇసుకను దోచుకుంటూ, అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టి ఈడ్చిన ఎమ్మెల్యేను కాల్చి పారేయకుండా, కనీసం అరెస్టు చేసి జైల్లో వేయకుండా.. బాధితురాలిపై చంద్రబాబు ప్రభుత్వం కన్నెర్ర జేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చెప్పిన మాటలు అక్షర సత్యమని అన్నారు. గురువారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేణమాల గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళల ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ‘సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఓ దళిత మహిళను బట్టలూడదీసి అవమానించి, ఆ ఘటనను చిత్రించి సోషల్మీడియాలో పెడితే చర్యలు లేవు. మహిళలపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదును మహిళా కమిషన్ తీసుకోకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన కమిషన్ ఫిర్యాదును స్వీకరించింది’ అని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేను జైల్లో పడేసి ఉంటే అకృత్యాలు మళ్లీ జరిగేవా?
‘టీడీపీ నేతల బండరాన్ని బయటపెడతాం..’
టీఆర్ఎస్ పాలనలో అప్పులు రెట్టింపు
చెట్టు, చేప, ప్రకృతి.. ఇంట్రస్టింగ్ ఫ్రైడే
స్టాఫ్తో మంత్రుల సెక్స్.. ప్రధాని కీలక నిర్ణయం
‘చోటా మోదీ’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్