సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఏడాది అంతా హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, అప్పులు, ఆందోళనలతోనే గడిచిపోయిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. దిశ హత్య, హాజీపూర్, వరంగల్, ఆసిఫాబాద్, జడ్చర్ల ఘటనలు దేశవ్యాప్తం గా తెలంగాణ పరువు తీశాయని, ఈ ఏడాది తెలంగాణ అశాంతి నిలయంగా మారిందని శుక్రవారం ఆయన ఓప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు.