-

సీఎం ప్రకటన ప్రజలను అవమానించడమే: ఉత్తమ్‌

11 Jul, 2020 02:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయం కాంప్లెక్స్‌లో ఉన్న ఆలయం, మసీదు కూల్చి  వేతపై సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన ప్రజల్ని ఘోరంగా అవమానించడమేనని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయం, మసీదులను ఎంతో పవిత్రమైనవిగా ఆయా వర్గాల ప్రజలు భావిస్తారని,  వాటిని  కూల్చి వేయడం దారుణమన్నారు.  ఆలయం, మసీదును కూల్చివేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. 

మరిన్ని వార్తలు