రాములు నాయక్ సస్పెన్షన్పై టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: నారాయణఖేడ్ టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డిని ఇబ్బందులకు గురి చేసినందుకే ఎమ్మెల్సీ రాములు నాయక్ను సస్పెం డ్ చేశామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్ వెల్లడించారు. మంగళవారం టీఆర్ఎస్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదనే అక్కసుతోనే రాములు నాయక్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులంతా తన వెంట ఉన్నారని ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆయనకు అంత స్థాయి లేదని విమర్శించారు.