కేసీఆర్ నిజ స్వరూపం చూపిస్తున్నారు..

15 Mar, 2018 12:15 IST|Sakshi
టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ

సాక్షి, జగిత్యాల : అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్‌ నిజస్వరూపం చూపుతున్నారని తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రమణ విమర్శించారు. అసెంబ్లీలో జరుగుతున్నపరిణామాలపై ఆయన జగిత్యాలలో గురువారం మీడియాతో మాట్లాడుతూ...‘ కేసీఆర్‌ దళితులను దగా చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అనుచరుల కోసమే ప్రాజెక్టుల అంచనాలు పెంచారు. అడ్డగోలు భూసేకరణ చేసి రైతులను మోసం చేశారు. ప్రగతి భవన్‌ పైరవీ కారులకు అడ్డాగా మారింది. మంత్రులకు అపాయింట్‌మెంట్‌ దొరకదు కానీ, దొంగలకు మాత్రం దొరుకుతుంది’ అన్నారు.

మరిన్ని వార్తలు