-

అరెస్టులతో కాంగ్రెస్‌ భయపడదు: ఉత్తమ్‌ 

12 Sep, 2018 01:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ కేడర్‌ను నైతికంగా దెబ్బతీసేందుకు చేస్తున్న అక్రమ అరెస్టులకు పార్టీ భయపడదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొ న్నారు. కాంగ్రెస్‌ నేతలు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహల అరెస్టులను ఖండించారు. బ్రిటిష్‌ పాలననే అంతమొదించిన కాంగ్రెస్‌ శ్రేణులు రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలనను కూడా తుదముట్టించేందుకు సిద్ధంగా ఉన్నా రని ఆయన మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు