ఉత్కంఠగా ఉయ్యూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక

3 Aug, 2018 14:28 IST|Sakshi

ఉయ్యూరు:  ఉయ్యూరు మున్సిపల్‌ చైర్మన్‌, వైఎస్‌ చైర్‌ పర్సన్‌ ఎన్నిక ఉత్కంఠగా సాగింది. టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌లు సంయుక్తంగా రాజకీయం నడిపి తమ వారికి పదవులు వచ్చేట్లు చేశారు. ఎట్టకేలకు ఒప్పందం ప్రకారం చైర్మన్‌గా అబ్దుల్‌ ఖుద్దూస్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌గా పండ్రాజు సుధారాణిలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైస్‌ చైర్‌ పర్సన్‌, చైర్మన్‌లతో జాయింట్‌ కలెక్టర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

మరిన్ని వార్తలు