వంతల రాజేశ్వరిని ఓడించండి, అత్తింటివారి అభ్యర్థన

9 Apr, 2019 17:34 IST|Sakshi

సాక్షి​, తూర్పు గోదావరి : రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంతల రాజేశ్వరికి వ్యతిరేకంగా ఆమె కుటుంబసభ్యులే ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా రాజేశ్వరిని ఓడించాలంటూ అత్తింటి తరఫు కుటుంబసభ్యులు ప్రాధేయపడుతున్నారు.  ఈ సందర్భంగా వంతల రాజేశ్వరిపై అత్తింటివారు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజేశ్వరిని కిషోర్ అనే గిరిజనేతరుడు తన చెప్పుచేతల్లో ఉంచుకుంటూ తమ కుటుంబానికి దూరం చేశాడంటూ విమర్శలు గుప్పించారు.  ఆమెని మభ్యపెట్టి భర్తను దూరం చేయడంతో అతడు మతిస్థిమితం కోల్పోయాడని ఆవేదన చెందారు. ఈ ఎన్నికల్లో ఓడించి తమ కుటుంబం రోడ్డున పడకుండా చూడాలని విజ్ఞప్తి  చేశారు. తమకు ప్రాణహాని ఉందంటూ వంతల రాజేశ్వరి అత్తింటివారు ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు