‘బాబుకు పాలించే అర్హత లేదు’

20 Aug, 2018 15:12 IST|Sakshi
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్‌

సాక్షి, తిరుపతి: దొంగ హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబుకు పాలించే అర్హత లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. ఏపీలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవ చేశారు. దుగరాజు పట్నం పోర్టు రాకపోవడానికి నూటికి నూరు పాళ్లు చంద్రబాబే కారణమని మండిపడ్డారు. కృష్ణపట్నం పోర్టు కోసమే దుగరాజు పట్నంను అడ్డకున్నారని ధ్వజమెత్తారు. మన్నవరం ప్రాజెక్టు రాకతో బతుకులు మారతాయని ఆశపడిన జిల్లా ప్రజలు చంద్రబాబు అసమర్థతో నిరాశకు గురయ్యారని వివరించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సీఎం అయితేనే మన్నవరం ప్రాజెక్టు బాగుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు