వరవరరావు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్లో మజ్దూర్ సంఘటన్ సమితిపై నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్ దాస్ నిర్ణయం తీసుకోవడాన్ని రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ ఖండించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం వెల్లడించాలని ఫ్రంట్ అధ్యక్షుడు వరవరరావు సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
అక్కడి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడుతున్న వారిని అణగదొక్కాలనే కుట్ర సాగుతోందని వ్యాఖ్యానించారు. వెంటనే సంఘటన్ సమితిపై బేషరతుగా నిషేధం ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ప్రజా పోరాటాలపై పోలీసు చర్యలను వెంటనే నిలిపేయాలని పేర్కొన్నారు.