‘వ్యయం పెంచి లగడపాటికి అప్పగించారు’

10 Apr, 2020 11:51 IST|Sakshi

సాక్షి,అమరావతి: వైద్య పరికరాల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం మెడ్‌టెక్‌ జోన్‌ను కేటాయిస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన ట్విటర్‌లో..  ‘వైద్య పరికరాల తయారీ కోసం కేంద్రం మెడ్ టెక్ జోన్ ను కేటాయిస్తే లడ్డూ దొరకినట్లుగా దాని నిర్మాణ వ్యయాన్ని 400 కోట్ల నుంచి 2500 కోట్లకు పెంచి లగడపాటికి అప్పగించి  స్కాంకు పాల్పడ్డాడు బాబు. సీఎం వైఎస్‌ జగన్ గారు నిధులు కేటాయించి కోవిడ్ టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్ల తయారీ మొదలు పెట్టించారు’అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు