బాబూ.. కర్రును కాల్చడం మొదలెట్టారు!

22 Mar, 2019 11:29 IST|Sakshi

ఓటమి భయంతో చంద్రబాబు వణికిపోతుంటే.. లోకేష్‌ పిల్లాడిలా ఆడుకుంటున్నాడు

ట్విటర్‌లో విజయ సాయిరెడ్డి సెటైర్స్‌

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్రజల జ్ణాపక శక్తి, మేధస్సుపై చంద్రబాబుకు చిన్నచూపు ఉందని, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు కనిపెట్టిన దగ్గర నుంచి సంక్రాంతికి గ్రామాలకు వెళ్లి పండుగ చేసుకోవాలనేది కూడా తమను చూసే ప్రజలు అలవాటు చేసుకున్నారని చెప్పినప్పుడే కర్రును కొలిమిలో వేడి చేయడం మొదలు పెట్టారన్నారు. ఏప్రిల్ 11న వాతలు పెడతారని తెలిపారు. ఇక పోలీసులు టీడీపీ ప్రచారకర్తలుగా మారారని మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి ప్రచారాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని, కార్యకర్తలను బెదిరిస్తున్నారన్నారు. ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కి పోలీసులే తెలుగుదేశం ప్రచారకర్తలుగా మారారని, ఎన్నికల కమిషన్‌ రాప్తాడుపై ప్రత్యేక నిఘా పెట్టాలని డిమాండ్‌ చేశారు.

చిన్నపిల్లాడిలా లోకేష్‌..
వరదల్లో ఇళ్లలోకి నీరొస్తే సర్వం కోల్పాయామని పెద్దలు విలవిల్లాడుతుంటారని, ఉపద్రవం తీవ్రత తెలియని పిల్లలు మాత్రం నీటిలో ఉల్లాసంగా ఆడుకోవడం కనిపిస్తుందని తెలిపారు. ఇలానే ఓటమి కళ్లముందు కనిపిస్తుంటే చంద్రబాబు వణికి పోతున్నారని, ఇవేమీ అర్థంకాని లోకేశ్ మాత్రం చప్పుళ్లు కొట్టించుకుంటూ మంగళగిరిలో తిరుగుతున్నారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు