అస‌లు చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ బిడ్డేనా..!

13 May, 2020 11:02 IST|Sakshi

సాక్షి, అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. ఈ మేరకు ట్విట‌ర్‌లో చంద్రబాబుపై విరుచుకుప‌డ్డారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై త‌మ నిర్ణ‌యం ఎటువైపు అని ప్ర‌శ్నించారు. అడ్డమైన విషయాలపై జూమ్‌లో మాట్లాడే చంద్ర‌బాబు.. ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా అని నిల‌దీశారు. అస‌లు చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ బిడ్డేనా.. ఏపీ వారేనా అని ప్ర‌శ్నించారు. ('నా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు' )

చంద్రబాబు.. యూటర్న్ నాయుడు

మరిన్ని వార్తలు