ఇస్కో... ఉస్కో అంటూ శివాలూగాడు: విజయ సాయి రెడ్డి

12 Feb, 2020 11:36 IST|Sakshi

సాక్షి, అమరావతి :  వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు గత తొమ్మిది నెలల్లో చేసిన పనులను ట్విటర్‌ వేదికగా ఎండగట్టారు. ‘ప్రతిపక్ష నేతగా 9 నెలల్లో చేసిందేమిటంటే... ఇసుక మాఫియాను రక్షించేందుకు ఇస్కో... ఉస్కో అంటూ శివాలూగాడు. ‘ఇన్ సైడర్’ భూముల కోసం ప్రభుత్వాన్నికూలుస్తా... తేలుస్తా అని గాల్లో కత్తులు తిప్పాడు. అవినీతి అధికారులకు కాపలాదారయ్యాడు. పొర్లు దండాలతో బొంగరంలా తిరగడమే మిగిలింది ’ అంటూ బాబుపై విమర్శలు గుప్పించారు.

మరిన్ని వార్తలు