‘ఇది ఉల్లిపాయపై పొర మాత్రమే’

14 Feb, 2020 11:33 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు టీడీపీ అధినేత పీఏపై ఇటీవల జరిగిన ఐటీ దాడుల్లో రూ.2 వేల కోట్ల బాగోతం బయటపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్ధేశించి ఎంపీ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘పీఎస్ ఇళ్లను సోదాలు చేస్తేనే వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడింది. బినామీలు, పెంచి పోషించిన కాంట్రాక్టు సంస్థలను జల్లెడ పడితే పది లక్షల కోట్లయినా దొరుకుతాయి. బాబు నెట్ వర్క్ను చూసి ముంబాయి కార్పోరేట్ సంస్థలన్నీ బిత్తర పోయాయట. ఇప్పడు బయటకొచ్చింది ఉల్లిపాయపై పొర మాత్రమే.’’ అంటూ ట్వీట్‌ చేశారు. (బాబు తిప్పిన చక్రాలు ఏమయ్యాయో?)

అదే విధంగా ‘‘మహాత్మా గాంధీ లాంటివాడినని కటింగులిచ్చాడు. నిప్పు కణికలు నన్ను చూసి ఈర్షపడతాయని గొప్పలు పోయాడు. అక్రమ సంపాదనను వ్యవస్థీకృతం చేసి 14 ఏళ్ల పాటు విచ్చలవిడిగా దోచుకున్నాడు. వ్యవస్థలన్నిటిని మ్యానేజ్ చేసి తప్పించుకుంటూ వచ్చాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గ్రహించలేక పోయాడు.’’ అంటూ చురకలంటించారు. 

మరిన్ని వార్తలు