ట్విటర్లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి కూడా తమ పార్టీయే కారణమని సీఎం చంద్రబాబు చెబుతాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన ట్విటర్ వేదికగా తమపార్టీపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, కాంగ్రెస్లు రెండూ ద్రోహం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబ్తుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబే ప్యాకేజీ ముద్దు అన్నాడని, ఇప్పుడు యూటర్న్ తీసుకుని హోదా కావాలంటున్నాడని మండిపడ్డారు. దళారీ వ్యవహారాలకు అలవాటు పడిన బాబుకు ఇతరుల నిజాయితీని శంకించడం అలవాటేనన్నారు.
చంద్రబాబుకు కెసీఆర్ అన్నా మోదీ అన్నా వణుకని, తనలాగా ఇతరులకు చెమటలు పట్టడం లేదు కాబట్టి అంతా కలిసి పోయారని గుండెలు బాదుకుంటాడని తెలిపారు. జర ఫోబియాల నుంచి బయటపడండి చంద్రబాబు గారూ! అంటూ సెటైరికల్గా ట్వీట్ చేశారు.