గత ఐదేళ్ల పీడకలను ప్రజలు మర్చిపోయేలా..

8 Jun, 2019 11:02 IST|Sakshi

సాక్షి, అమరావతి : గత ఐదేళ్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పీడకలను ప్రజలు మర్చిపోయేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను అందిస్తారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. యువ సీఎం వైఎస్‌ జగన్‌ పాలనతో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే ది​క్సూచిగా మారుతుందన్నారు. శనివారం ట్విటర్‌ వేదికగా వైఎస్‌ జగన్‌, మరికాసేపట్లో కొలువుదీరే ఆయన కేబినెట్‌పై విజయసాయి రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. ‘జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే దిక్సూచిగా మారుతుంది. అభివృద్ధి వైపు అడుగులు మొదలయ్యాయి. గడచిన ఐదేళ్ల పీడకలను ప్రజలు మర్చిపోయేలా చేస్తారాయన. ఎక్కడా దాపరికం లేని పారదర్శకత కనిపిస్తుంది. ప్రతీ కార్యక్రమంలోనూ ప్రజల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు మన యువ సీఎం.’ అని పేర్కొన్నారు.

మంత్రివర్గం కూర్పులో సామాజిక సమతుల్యతకు పెద్ద పీట వేస్తూ సీఎం జగన్‌ దేశంలోనే ఒక మోడల్‌ కేబినెట్‌ను ఏర్పాటు చేశారని విజయసాయి రెడ్డి కొనియాడారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఒక వినూత్న ప్రయోగమని అభిప్రాయపడ్డారు. అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మంత్రులంతా ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా శ్రమించాలని పిలుపునిచ్చారు.
 

మరిన్ని వార్తలు