‘ప్రజా సంకల్పం’ ప్రారంభాన్ని విజయవంతం చేయండి

5 Nov, 2017 01:35 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6వ తేదీన ఇడుపులపాయ నుంచి చేపడుతున్న ‘ప్రజా సంకల్పం’ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సోమవారం ఉదయం 9 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, శ్రేణులు సోమవారం ఉదయం 8.30 గంటలలోపు అక్కడకు చేరుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాలకు విజయసాయిరెడ్డి లేఖలు పంపారు. 

మరిన్ని వార్తలు