సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మరోసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్లపై విమర్శనాస్త్రాలు సంధించారు. శనివారం ట్విటర్లో.. ‘‘ చంద్రబాబు నాయుడు భారత్నుంచి పారిపోవటానికి చూస్తున్నట్లు తెలిసింది. ఇక్కడినుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవటానికి తన మిత్రుడు, పారిపోయి లండన్లో తలదాచుకుంటున్న ఓ పారిశ్రామికవేత్తను సంప్రదించినట్లు విన్నాను’’ అని పేర్కొన్నారు. ( ‘చిట్టి నాయుడు దెబ్బ.. అచ్చెన్న అబ్బ’ )
‘‘ చంద్రబాబు, లోకేష్ బాబుల ద్వయం లాక్డౌన్ సమయంలో హైదరాబాద్ భద్రత కలిగిన ప్రదేశమని అనుకున్నారు. కానీ, ఇప్పుడు విచారణ సంస్థల నుంచి తప్పించుకోవటానికి మరో చోటు కోసం అన్వేషిస్తున్నారు’’ అని అన్నారు.
‘‘ అచ్చెన్న, ఉమ, యనమల, కాల్వ, పరిటాల, నారాయణ ఇలా టీడీపీ హయాంలోని మంత్రులు దోచుకున్న ప్రజాధనంలో 60 శాతం పెద బాబు, చిన బాబులకు ముడుపులుగా వెళ్లాయి. అందుకే అవినీతిని ప్రోత్సహించారు. ఇప్పుడు నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుల్లా నాటకాలాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు.