హామీలన్నీ నెరవేర్చామన్న ‘పప్పు’ను పిచ్చాసుపత్రిలో చేర్చాలి

12 Sep, 2018 04:07 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌

సాక్షి, అమరావతి: టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు వందకు 100% అమలు చేశామని ప్రకటించిన మంత్రి  లోకేశ్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘టీడీపీ మేనిఫెస్టోను 100కు 100% అమలు చేశామని లోకేశ్‌నాయుడు ఈ రోజు చెప్పారు.

ఈ ప్రకటన చేసిన పప్పు నాయుడిని పిచ్చాసుపత్రిలో చేర్చాలి. కార్నెగీ, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయాలు లోకేశ్‌కు ఇచ్చిన డిగ్రీలను రద్దు చేయాలి. లేదంటే ఆ యూనివర్సిటీల పరువు పోతుంది’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు