వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
సాక్షి, అమరావతి: టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు వందకు 100% అమలు చేశామని ప్రకటించిన మంత్రి లోకేశ్ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ‘టీడీపీ మేనిఫెస్టోను 100కు 100% అమలు చేశామని లోకేశ్నాయుడు ఈ రోజు చెప్పారు.
ఈ ప్రకటన చేసిన పప్పు నాయుడిని పిచ్చాసుపత్రిలో చేర్చాలి. కార్నెగీ, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాలు లోకేశ్కు ఇచ్చిన డిగ్రీలను రద్దు చేయాలి. లేదంటే ఆ యూనివర్సిటీల పరువు పోతుంది’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.