‘మీ నాన్నకు నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు’

25 Dec, 2019 10:51 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నించిన టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ చేసిన మరోసారి నవ్వుల పాలయ్యారు. జనాభా లెక్కల కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను.. ఎన్నార్సీ అంటూ లోకేశ్‌ ఓ ట్వీట్‌లో ప్రస్తావించారు. దీంతో లోకేశ్‌ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా లోకేశ్‌పై వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పరోక్షంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన ఇంగ్లిష్‌ జ్ఙానం చూసి వాళ్ల నాన్నకు నవ్వాలో, ఎడవాలో తెలియడం లేదని.. అందుకే ప్రెస్‌మీట్లలో ఫ్రస్టేట్‌ అవుతున్నాడని ఎద్దేవా చేశారు. 

‘పప్పూ! నీది సార్ధక నామధేయం. జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి. దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్నార్సీ అంటూ అర్ధం చేసుకున్నావంటే... నీ ఇంగ్లీషు,  నీ జ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజు ప్రెస్మీట్లలో  ఫ్రస్టేట్ అవుతున్నాడ’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు