‘మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి’

4 Mar, 2020 12:16 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ నేత నారా లోకేశ్‌పై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోకేశ్‌కు నోటి దూల ఎక్కువైందని, అతన్ని కరోనా క్వారంటైన్‌లో పెట్టాలని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. 'మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి. వ్యాధి లక్షణాలేవీ బయటకు కనిపించకున్నా అతని నోటి దూల సమాజంలో అశాంతిని ప్రేరేపించేలా ఉంది. అత్యంత నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న 4.5 లక్షల మంది వాలంటీర్లను రేపిస్టులు, దండుపాళ్యం క్రిమినల్స్ అని తిట్టి పోస్తున్నాడు' అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

(చదవండి : ‘అంగిట బెల్లం ఆత్మలో విషం’ ఇది బాబు నైజం)

మరిన్ని వార్తలు