మంగళగిరిలో ప్రలోభాలు.. స్థానికుల ఆగ్రహం

31 Mar, 2019 18:48 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ పోటీ చేస్తున్న మంగళగిరిలో అధికార పార్టీ టీడీపీ ప్రలోభాలకు దిగుతోంది. దింపుడు కల్లం ఆశతో చివరి నిమిషంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు విపరీతంగా ఆరాటపడుతోంది. ఇందులో భాగంగా కొలనుకొండలో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటుచేసేందుకు ప్రయత్నించగా.. ఎన్నికల సమయంలో హడావిడిగా వీటిని ఏర్పాటు చేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. గడిచిన ఐదేళ్లలో చేయని కార్యక్రమాలు ఇప్పుడెందుకు హడావిడిగా చేపడుతున్నారని, ఎన్నికల సమయంలో ఇది గుర్తుకువచ్చిందా? అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం మభ్యపెట్టేందుకు అధికార పార్టీ ఎన్నికల వేళ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోందని కొలనుకొండ గ్రామస్థులు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు