బాబు దీక్ష: ఐదు వందలు, రెండుపూటల భోజనం

1 Jul, 2018 12:44 IST|Sakshi

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల ధర్మపోరాట దీక్షల పేరిట హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. రోజుకో ప్రాంతంలో ఆయన ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారని, అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిన చంద్రబాబు చేస్తున్నది ధర్మపోరాట దీక్ష కాదు.. అధర్మపోరాట దీక్ష అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు జనాన్ని తరలిస్తున్న తీరుపైనా సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీగా డబ్బులిచ్చి మరీ జనాన్ని బాబు సభలకు తీసుకువెళుతున్నారని అంటున్నారు. ఈ వాదనకు బలం చేకూర్చేలా తాజాగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ధర్మపోరాట దీక్షలో పాల్గొంటే.. తలా రూ. ఐదేసి వందలు ఇచ్చి.. రెండు పూటలా భోజనం పెడుతున్నారని ఓ మహిళ ఈ వీడియోలో చెప్పడం గమనార్హం.

ఇటీవల చంద్రబాబు సభ కోసం మహిళలను టీడీపీ నేతలు బస్సులో తరలించే సమయంలో ఓ వ్యక్తి ఈ వీడియోను తీసి.. సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ వీడియోలో పలువురు మహిళలు టీడీపీ సమకూర్చిన బస్సులో వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. వీడియో తీసిన వ్యక్తి వారిలోని ఓ మహిళను కదలించడంతో ఆమె అసలు గుట్టు బయటపెట్టారు. చంద్రబాబు సభకు వెళుతున్నందుకు టీడీపీ నేతలు తమకు ఎంత డబ్బు ఇస్తున్నది వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వార్తలు