సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్జగన్మోహన్రెడ్డి ఫొటోపై కామెంట్తో తాను ట్వీట్ చేసినట్లుగా ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో వచ్చిన కథనాన్ని ‘సాక్షి’ మీడియా గ్రూప్ చైర్పర్సన్ వైఎస్ భారతిరెడ్డి ఖండించారు. తనకు అసలు ట్వీటర్లోగాని, ఫేస్బుక్లోగాని అకౌంట్లు లేవని స్పష్టంచేశారు. తన పేరుతో ఎవరైనా నకిలీ ఖాతా సృష్టించి ఉంటారేమో తనకు తెలియదన్నారు. ఆంధ్రజ్యోతి కథనం పూర్తిగా సత్యదూరమని పేర్కొన్నారు.