దేశంలో ఉండేందుకు వారు మాత్రమే అర్హులు: కేంద్రమంత్రి

29 Dec, 2019 16:39 IST|Sakshi

సాక్షి, ముంబై : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు. ‘భారత్‌ మాతాకీ జై’ అనే వారే ఈ దేశంలో నివసించడానికి అర్హులని అన్నారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారంతా ఇక్కడ ఉండటానికి భారత్‌ ధర్మసత్రం కాదని వ్యాఖ్యానించారు. చట్టాలను గౌరవించలేని వారు ఇక్కడ ఉండేదుకు అనర్హులని పేర్కొన్నారు. ఆదివారం ముంబైలో జరిగిన ఏబీవీపీ మహాసభల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని ఆయన తప్పుపట్టారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ఈ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పౌరులుకు శాశ్వత గుర్తింపు కార్డులు జారీ చేయకుండా ప్రపంచంలో ఏ దేశమూ లేదని ఆయన గుర్తుచేశారు. దేశ భద్రత కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంపై వివక్షాలు నిరసల చేయాల్సి అవసరం ఏముందని  ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు