సాక్షి, హైదరాబాద్ : వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే కచ్చితంగా థర్డ్పార్టీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం హోం శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాష్ట్రపతి దృష్టికి సైతం తీసుకెళ్తామంటున్నారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం ఘటనతో తమకు సంబంధం లేదంటున్న రాష్ట్రప్రభుత్వం.. థర్డ్పార్టీ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు.
మిథున్రెడ్డితో ‘సాక్షి’ కరస్పాండెంట్ చంద్రకాంత్ ఫేస్ టు ఫేస్ ఇక్కడ చూడండి..