లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వరుసగా మూడేళ్లు పూర్తి చేసుకున్న ఏకైక బీజేపీ సీఎంగా రికార్డులకెక్కారు. 2017లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే ఏడాది మార్చి 15న యూపీ ముఖ్యమంత్రిగా యోగి బాధ్యతలు స్పీకరించారు. ఈ క్రమంలోనే నేటితో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయింది. అయితే ఇంతకుముందు బీజేపీ తరఫున కళ్యాణ్ సింగ్, రామ్ ప్రకాశ్ గుప్తా, రాజ్నాథ్ సింగ్లు సీఎంగా పనిచేసినప్పటికీ.. ఎవరూ కూడా మూడేళ్లు పదవిలో కొనసాగలేకపోయారు. గత ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో తన పదవికి ఎలాంటి ఆటంకం కలగకుండా.. యోగి సీఎం పదవిలో కొనసాగుతున్నారు.