రసమయికి టికెట్‌ వద్దంటూ సెల్‌టవర్‌ ఎక్కిన యువకులు

10 Sep, 2018 02:32 IST|Sakshi

అల్గునూర్‌ (మానకొండూర్‌): కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ అసెంబ్లీ అభ్యర్థిగా రసమయి బాలకిషన్‌ను కాకుండా ఓరుగంటి ఆనంద్‌ను నిలబెట్టాలని డిమాండ్‌ చేస్తూ తిమ్మాపూర్‌ మండల కేంద్రంలో ముగ్గురు యువకులు ఆదివారం సెల్‌ టవర్‌ ఎక్కారు. స్థానికుడైన ఓరుగంటి ఆనంద్‌ను కాదని స్థానికేతరుడైన రసమయికి టికెట్‌ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. రసమయి కార్యకర్తలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఓరుగంటి ఆనంద్‌కు టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చేవరకూ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. మరికొంతమంది టీఆర్‌ఎస్‌ నాయ కులు కూడా ఓరుగంటికి టికెట్‌ ఇవ్వాలని తిమ్మాపూర్‌ వద్ద ఆందోళన చేశారు. 

>
మరిన్ని వార్తలు