292వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

23 Oct, 2018 08:16 IST|Sakshi

సాక్షి, సాలూరు (విజయనగరం జిల్లా) : రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 292వ రోజు పాదయాత్ర మంగళవారం ఉదయం సాలూరు శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి సీతమ్మదొరపాలెం క్రాస్‌ రోడ్డు, చంద్రప్పవలస క్రాస్‌రోడ్డు, దేవబుచ్చమ్మపేట, వల్లాపురంల మీదుగా సన్యాసిరాజుపేట వరకు కొనసాగనుంది.

వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని గ్రామాల్లోని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. కాగా, ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమనోత్సవం పురస్కరించుకుని మంగళవారం పాదయాత్ర మధ్యాహ్నం వరకే సాగనుంది. ఈ ఉత్సవంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.

మరిన్ని వార్తలు