302వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

19 Nov, 2018 19:19 IST|Sakshi

సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 302వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం జననేత కురుపం నియోజకవర్గం, జియమ్మ వలస మండలంలోని నైట్‌క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.

అక్కడి నుంచి బట్లబద్ర, జోగిరావుపేట, పుతిక వలస మీదుగా కాటమ్‌ దొర వలస క్రాస్‌, కురుపం వరకు పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం కురుపం వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు