304వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

23 Nov, 2018 21:08 IST|Sakshi

సాక్షి, విజయనగరం : రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 304వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది.

జననేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన యాత్ర శనివారం కురుపాం నియోజకవర్గం, జియమ్మ వలస మండలంలోని శిఖబడి క్రాస్‌ నుంచి ప్రారంభంకానుంది. అక్కడి నుంచి బిజేపురం, గెద్ద తిరువాడ, యిటిక, కుందర తిరువాడ క్రాస్‌, చిన్న కుదమ క్రాస్‌ మీదుగా తురకనాయుడు వరస వరకు పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

>
మరిన్ని వార్తలు