319వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

10 Dec, 2018 20:27 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం:  అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 319వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న తనయుడు మంగళవారం ఉదయం శ్రీకాకుళం నియోజకవర్గంలోని నందగిరి పేట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.

అక్కడి నుంచి నాదాలపురం, బ్రిడ్జి రోడ్‌ సెంటర్‌, చిన్నతాండ మీదుగా ఆముదాల వలస, కాలేజ్‌ రోడ్‌ వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. సాయంత్రం ఆముదాల వలస వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు