దర్శి అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్‌ జగన్‌

3 Mar, 2018 18:08 IST|Sakshi

సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం ప్రకటించారు. దర్శి అభ్యర్థిగా మాధవ్‌ పేరును ఆయన ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాళ్లూరు బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. మాధవ్‌ అందరూ ఆదరించాలని వైఎస్‌ జగన్‌ ప్రజలను కోరారు. ప్రజాసంకల్పయాత్ర 102వ రోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కొనసాగింది.  తాళ్లూరు  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

మరిన్ని వార్తలు