వైఎస్సార్‌ సీపీ విశాఖ దక్షిణ కోఆర్డినేటర్‌గా రమణమూర్తి

16 Sep, 2018 19:22 IST|Sakshi
వైఎస్‌ జగన్‌తో రమణమూర్తి

సాక్షి, విశాఖపట్నం : విశాఖ దక్షిణ నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోఆర్డినేటర్‌గా డాక్టర్‌ రమణమూర్తిని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నియమించారు. ఇప్పటివరకు ఈ పదవిలో కోలా గురువులు ఉండగా ఆయనను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాన్‌ వెస్లీని పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రముఖ సామాజికవేత్త, కళా ఆస్పత్రి ఎండీ అయిన డా. పీవీ రమణమూర్తి ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు