వైఎస్‌ జగన్‌ రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్‌

26 Mar, 2019 17:22 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపటి(బుధవారం) ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 27న విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటిస్తారు. బుధవారం ఉదయం 9.30గంటలకు విజయనగరం జిల్లా పార్వతీపురంలో, మధ్యాహ్నం 1.30గంటలకు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3.30గంటలకు తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రచారం చేస్తారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు